PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కృష్ణ‌భార‌తి కాళ్ల‌కు న‌మ‌స్క‌రించిన మోదీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రసిద్ధ సమరయోధులు తాడేపల్లిగూడేనికి చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మీ దంపతుల కుమార్తె కృష్ణభారతి కాళ్లకు నమస్కారం చేసి తన దేశభక్తిని మోదీ మరోసారి చాటారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కృష్ణమూర్తి దంపతులు కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో అంజలక్ష్మి తంజావూరు జైలులో కృష్ణభారతికి జన్మనిచ్చారు. దీంతో కృష్ణుడు మాదిరిగా జైలులో పుట్టినందుకు కృష్ణ అని, దేశం కోసం అరెస్టు అయినందువల్ల భారతి అని కలిపి కృష్ణభారతిగా పేరు పెట్టారు. తల్లిదండ్రుల జాతీయ భావాలను పుణికి పుచ్చుకున్న కృష్ణభారతిని వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆమె కుటుంబ చరిత్రను వేదికపై వివరించారు. దీంతో ప్రధాని మోదీ ఆమె కాళ్లకు నమస్కరించారు.

                                          

About Author