PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`డోలో-650` సీఎండీ కార్యాల‌యంలో ఐటీ సోదాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బెంగ‌ళూరులోని ఔషధ తయారీ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. దాదాపు 20 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ కంపెనీ డోలో-650 ఔషధాన్ని తయారు చేస్తుందనే సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖలోని విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, దేశవ్యాప్తంగా 40 చోట్ల దాదాపు 200 మంది అధికారులు ఈ కంపెనీ కార్యాలయాల్లో సోదాల్లో పాల్గొన్నారు. న్యూఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవాలలోని కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానాల నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్నారు.

                                      

About Author