PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిత్రా రామ‌కృష్ణ అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్ట్ చేసి, ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరుపరచింది. కోర్టు ఆమెను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది. చిత్ర రామకృష్ణ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే, ఎన్ఎస్ఈ మాజీ అధిపతి రవి నారాయణ్‌లపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసును నమోదు చేసింది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కేసులో సీబీఐ , ఈడీ దృష్టిలో ఓ సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సంజయ్ పాండేకు సంబంధించిన సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టుపైనా, కొందరిపై అక్రమంగా నిఘా పెట్టడంపైనా దర్యాప్తు జరుపుతుండగా సీబీఐ దృష్టిలోకి ఈ జర్నలిస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. సంజయ్ పాండే చట్టవ్యతిరేకంగా కొందరిపై నిఘా పెట్టినట్లు సాక్ష్యాధారాలు లభించాయని సమాచారం.

                                       

About Author