PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హోటళ్ల యజమానులు సహకరించాలి

1 min read

– ఎస్​ఐ శ్రీనివాసులు రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శనివారం రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 5 గంటల వరకు హోటళ్లు, బంకులు మూసివేయాలని ఎస్​ఐ వి. శ్రీనివాసులు రెడ్డి సూచించారు. ఎస్పీ ఉత్తర్వుల మేరకు శనివారం హోటళ్లు, బంకుల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాత్రి పది గంటల తర్వాత ఎవరు కూడా హోటల్లు నిర్వహించ రాదని, కేవలం పార్సిల్ మాత్రమే పెట్టుకోవాలన్నారు. కరోనా సెకండ్​ వేవ్​లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఇప్పటికే ఎంతో మంది మృతి చెందారన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్​ ధరించాలని, శానిటైజర్​ వాడుతూ భౌతిక దూరం పాటించాలన్నారు.

About Author