PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌డ‌ప‌లో 175 మంది రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.. జ‌న‌సేన రిపోర్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. సీఎం సొంత జిల్లా ఒక్క కడపలోనే 175 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ జనసేన సంచనల ఆరోపణ చేసింది. కౌలు రైతుల ఆత్మహత్యలను కరోనా నెపంతో బయటకు రాకుండా దాచారంటూ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కేవలం బటన్ నొక్కితేనే బ్రహ్మాండంగా సంక్షేమం జరిగిపోతుందని చెబుతూ జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ఈ నెల 21న ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేసేందుకే పవన్ కల్యాణ్ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తున్నట్లు నాదెండ్ల వెల్లడించారు.

                                                    

About Author