PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పై భార‌త్ ఘ‌న విజ‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు సాగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో భారత్ దే పైచేయిగా నిలిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. తద్వారా గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలోనే ఛేదించింది. హార్దిక్ పాండ్యా చిచ్చరపిడుగులా చెలరేగాడు. పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జడేజా 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 35 పరుగులు చేశాడు. అంతకుముందు, విరాట్ కోహ్లీ 35 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. చివర్లో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోగా… రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా జోడీ ఆత్మవిశ్వాసంతో ఆడి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది.

                                          

About Author