PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబును కలిసిన టిజి భరత్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కర్నూల్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టిజి భరత్ కలిశారు. హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో చంద్రబాబును కలిసినట్లు భరత్ తెలిపారు. కర్నూలులో పార్టీ పరిస్థితి గురించి ఇరువురు చర్చించినట్లు చెప్పారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని చంద్రబాబుకి వివరించినట్లు భరత్ అన్నారు. ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల గురించి వివరించానన్నారు. సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే రాష్ట్రం, ప్రజలు బాగుపడతారని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నట్లు చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నందుకు టిజి భరత్ ను చంద్రబాబు అభినందించినట్లు తెలిపారు.

                                            

About Author