PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌ట‌న‌.. ఏపీలో సంబురాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటనపై ఏపీలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిఫై ఏపీ టీఆర్‌ఎస్ నేతలు కొబ్బరికాయలు కొట్టారు. ఏపీలో బీఆర్ఎస్ ఆడుగులు పడబోతున్నాయని, రాష్ట్రానికి చెందిన కీలక నేతలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని ఏపీ టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక మార్పు లక్ష్యంగా అడుగులు పడబోతున్నాయని తెలిపారు. తెలుగువాడు ప్రధాని కాబోతున్నారని, ఇది తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆ మధ్య కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రులో ఘనంగా నిర్వహించారు. ఉండి, వెలివర్రుకు చెందిన కేసీఆర్‌ అభిమానులు దండు సుబ్బరాజు ఆయన మిత్రులు భారీ కేక్‌ను తయారు చేయించి కట్‌ చేశారు.

                                          

About Author