PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భవన నిర్మాణం పనుల్లో వేగం పెంచాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: మండలంలో చేపడుతున్న భవన నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని పంచాయతీరాజ్ డిఈ సిబ్బందికి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో చేపడుతున్న సమావేశం భవనం మరమ్మతులు నిర్మాణం చేపట్టనున్న సిసి రోడ్లు పనులను మంగళవారం ఆయన పరిశీలించి పనులకు సంబంధించిన పలు అంశాలపై సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ అభివృద్ధి నిధులతో సమావేశ భవనం మరమ్మతులు అలాగే కార్యాలయం ప్రాంగణంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా సమావేశ భవనంలో చేపట్టాల్సిన పనులపై జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించామన్నారు. మండలంలోని సచివాలయాల పరిధిలో నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ భవనాలు వివిధ దశలో ఉన్నాయని నిర్మాణాలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించామన్నారు. ఆలమూరు శ్రీరంగాపురం గ్రామాలలో సచివాలయం నూతన భవన నిర్మాణాలు పూర్తయ్యాయని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆయన వెంట ఎంపీడీవో మధుసూదనరెడ్డి పంచాయతీరాజ్ ఏఈ వెంకటరాముడు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులున్నారు.

About Author