PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో విధినిర్వహణ అడుగులలో ఊపిరే త్యాగముగా పోలీసులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి అర్పించిన ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జిల్లా అధికారుల సమక్షంలో ఏర్పాటు చేయడమైనది. ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలలో భాగంగా నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలు గురించి పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్య అతిధి, ప్రముఖుల రాక, పార్కింగ్, స్మృతి పరేడ్ నిర్వహణ, అమరులకు నివాళులు అర్పించడంలో పాటించాల్సిన విధివిధానాలు, తదితర విషయాలను సమగ్రంగా చర్చించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఎస్పీ అడ్మిన్ ఆర్. రమణ గారు, డిఎస్పి మహేశ్వర్ రెడ్డి గారు, ఆర్ఐ సుధాకర్ గారు సిబ్బంది పాల్గొన్నారు.

About Author