PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక..

1 min read

పల్లెవెలుగు, వెబ్ రాయచోటి : అన్నమయ్య జిల్లా ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం – ఆంధ్రప్రదేశ్ సర్వ సభ్య సమావేశం రాయచోటిలో ని మార్కెట్ ఉర్దూ పాఠశాలలో ఎస్ .ముని రెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో రాయచోటి జిల్లా నూతన కార్యవర్గ ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులు లెక్కల జమాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లాఅధ్యక్షులుగా చెన్నుపల్లె ఓబుల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.ఎం.డీ జక్రియ, ఆర్థిక కార్యదర్శిగా జి. హరినారాయణ , సిపిఎస్ కన్వీనర్ గా ఏ. మోహన్ రెడ్డి, జిల్లా మైనారిటీ కన్వీనర్ గా ఎస్. లియాకత్, కో కన్వీనర్ గా ఎస్ కలీమున్నీసా ,రాష్ట్ర కౌన్సిలర్స్ గా ఎస్. పురుషోత్తం రెడ్డి , బి రాజగోపాల్ ,ఎస్ మజహరుల్ హక్, యస్.ముని రెడ్డి, కార్యదర్శులుగా సయ్యద్ భాష మరియు నరసింహ రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఎస్ కరీముల్లా , జిల్లా మహిళా కార్యదర్శిగా ఎస్.అఫ్సర్ బేగంఎన్నికయ్యారు. పప్పిరెడ్డి చిన్న రెడ్డన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం.

About Author