PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవంగా బ్రాహ్మణ కార్తీక వన సమారాధన

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వన సమారాధన వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య కార్తీక దామోదర పూజ నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి, భవాని సహిత రామలింగేశ్వర స్వామి వారలకు పంచమృత అభిషేకం లు జరిగాయి. అనంతరం అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేనా నిత్య అన్నదానం సత్రం ఆధ్వర్యంలో కల శంకర వేద విద్యాలయం వేద విద్యార్థులచే చతుర్వేద పారాయణం స్వస్తి ఆశీర్వచనం అహుతులను ఆకట్టుకొన్నాయి అని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు తెలిపారు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి హెచ్ కె మనోహర రావు, గాడిచర్ల ఫౌండషన్ అధ్యక్షులు కల్కూర చంద్రశేఖర్ గారు k v సుబ్బారావు, నందవరీక బ్రాహ్మణ సంఘం కార్యదర్శి  సుదర్శన్ రావు  తాళ్లపాక నటరాజు ,  కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం కార్యవర్గ సభ్యులు ఉమేష్ , కేజీ ప్రభాకర్ రావు, శివరాం ప్రసాద్, భాను ప్రసాద్, దేవి ప్రసాద్, గోవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం 2000మందికి విధుభోజనం ఘనంగా జరిగింది.

About Author