PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యాహ్న భోజనం.. సూపర్​: డిప్యూటీ డీఈఓ

1 min read

పల్లెవెలుగు వెబ్​:చెన్నూరు  డిప్యూటీ డి ఈ ఓ రాజగోపాల్ రెడ్డి మంగళవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలల్లోని మౌలిక వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను 2022- 2023 సంవత్సరం గాను ఇంటర్మీడియట్ కాలేజీకి ఆఫ్ గ్రేడ్ చేసినందున , విద్యార్థుల విద్యా ప్రగతి గురించి అలాగే ఇంటర్ అడ్మిషన్స్ గురించి, తరగతి గదుల లో విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా నాడు ​​– నేడు పనుల గురించి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు సక్రమంగా మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారా.. గ్రుడ్లు సక్రమంగా అందుతున్నాయా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేసి,బాగుందని వంట ఏజెన్సీ వారిని ప్రశంసించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విమల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author