శ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి కి విరాళం అందజేత
1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నకు హైద్రాబాద్ వాస్తవ్యులు విజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు దేవస్థాన టిక్కెట్ బుకింగ్ కౌంటర్ నకు అవసరమైన TVS (ఎలక్ట్రికల్) ప్రింటర్ను విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది బసవరాజు, మల్లికార్జున పాల్గొన్నారు.

