PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఎన్టీఆర్​ 27వ వర్ధంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 27 వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ బి వి జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనెగండ్ల లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా, నటసార్వభౌముడిగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని,కీర్తిని ప్రపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారకరామారావు మనకు దూరమై 27 సంవత్సరాలు అయినా ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ళముందే కదలాడుతున్నట్టు ఉందని,తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్ కు మనం అందించే అసలైన ఘన ఘననివాళులు అర్పించడం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author