PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు

1 min read

– మండల వైద్య అధికారి డాక్టర్ చెన్నారెడ్డి ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని( సిహెచ్ సి) ఏర్పాటు చేయడం జరిగిందని పీహెచ్సీ కమిటీ చైర్మన్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మండల వైద్యాధికారి డాక్టర్ బి, చెన్నారెడ్డిలు తెలిపారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ కే ఓ ఆర్ కాలనీలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకే చోట ఉండడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇబ్బందులు ఉండేవని తెలిపారు, కాగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సహకారంతో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ఇటు చెన్నూరు టౌన్, అలాగే మైనార్టీ కాలనీ, కొండపేట, బలసింగన పల్లె , కనపర్తి తదితర గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని వారు తెలియజేశారు, అలాగే ఇక్కడ ఓపి తో పాటు, అన్ని రకాల రక్త పరీక్షలు చేయడం జరుగుతుందని, పీహెచ్సీలో లభించే అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు, ప్రతి సోమవారం చర్మవ్యాధుల డాక్టర్, జనరల్ మెడికల్ డాక్టర్ అందుబాటులో ఉంటారని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మండల ప్రజలు పీహెచ్సీ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని వారు కోరారు.

About Author