PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ప్రతిభ’కు.. గుర్తింపు..

1 min read

336 మంది విద్యార్థినులకు ‘మలబార్’​ స్కాలర్​షిప్​

అభినందించిన ఏపీ ఉమెన్​ కమిషన్​ రాయలసీమ ఇన్​చార్జ్​ రుఖియాబీ

పల్లెవెలుగు​, కర్నూలు: జిల్లాలో ప్రతిభ గల విద్యార్థినులను గుర్తించి… వారిని ప్రోత్సహించడంలో మలబార్​ గోల్డ్ అండ్​ డైమండ్​ షోరూం ముందుందని అభిప్రాయపడ్డారు ఏపీ ఉమెన్​ కమిషన్​ రాయలసీమ ఇన్​చార్జ్​ రుఖియాబీ. మంగళవారం కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో..  ఇంటర్మీడియట్​లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను గుర్తించి… వారికి  స్కాలర్​షిప్​లు అందజేశారు. ఈ సందర్భంగా రుఖియా బీ మాట్లాడుతూ బాలికల చదువును ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో మలబార్​ గోల్డ్​ సంస్థ  ఈ నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. జిల్లాలోని వివిధ కళాశాలలో ఇంటర్మీడియట్​ చదువుతున్న 336 మంది విద్యార్థినులకు రూ.8వేల నుంచి 10వేలు చొప్పున మొత్తం 29.6 లక్షలు స్కాలర్​ షిప్​  ఇచ్చారు. మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా 5500 మంది విద్యార్థినులకు స్కాలర్​షిప్​లు ఇస్తామని మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బాలికల చదువు.. దేశానికి వెలుగు లాంటిదని, ప్రతిఒక్కరూ బాలికల చదువును ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఏపీ ఉమెన్​ కమిషన్​ రాయలసీమ ఇన్​చార్జ్​ రుఖియాబీ కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్​ పీడీ  కేఎల్​ఆర్​కె కుమారి, కలెక్టర్​ కోటేశ్వరరావు సతీమణి స్వర్ణలత, మలబార్​ షోరూం స్టోర్​ హెడ్​ ఫయాజ్​, అసిస్టెంట్​ హెడ్​ సమీర్​, మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​వుల్లా, సుధాకర్​, మన్సూర్​, అరుణ్​ తదితరులు పాల్గొన్నారు.

About Author