PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు:74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మిడుతూరు మండలంలో పనిచేస్తున్న హౌసింగ్ ఇంచార్జ్ ఏఈ,ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఉత్తమ ప్రశంసా పత్రాలు అందజేశారు.మండలంలో పనిచేస్తున్న హౌసింగ్ ఇన్చార్జి రమేష్ మరియు చింతలపల్లి,అలగనూరు పంచాయతీ కార్యదర్శులు వినయ్ చంద్ర,ఎన్.అనురాధ ఉత్తమ అధికారులుగా గుర్తిస్తూ వీరికి నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో వీరికి జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్,జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ నిశాంతి వారికి ఉత్తమ ప్రశంసా పత్రాలను అందజేశారు.అందుకుగాను ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,ఏవో దశరథ రామయ్య,సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి అభినందించారు.

About Author