PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెన్నపూస రవీంద్రా రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పట్టబద్రుల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. శాప్ చైర్మన్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఏబీఎం పాలెం కౌన్సిలర్ కాటేపోగు చిన్న రాజు ,15వ వార్డు పరిధిలో కౌన్సిలర్ కృష్ణవేణమ్మ ,5 వ వార్డులో వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవింద్రా రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మున్సిపల్ చైర్మన్ దాసిసుధాకర్ రెడ్డి సచివాలయ ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వరయ్య ఆచారి, జబ్బార్, ఉపేంద్ర రెడ్డి, గోవింద రెడ్డి, మద్దిలేటి, బ్రహ్మయ్య, గోవింద్, సోషల్ మీడియా పట్టణ కో-కన్వీనర్ బ్రహ్మయ్య‌‌‌ ఆచారి తదీతరులు పాల్గొన్నారు.

About Author