PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమిష్టి కృషితో కరోనాకు అడ్డుకట్ట వేద్దాం

1 min read
కోవిడ్​ బాధితులతో మాట్లాడుతున్న కొరముట్ల శ్రీనివాసులు

కోవిడ్​ బాధితులతో మాట్లాడుతున్న కొరముట్ల శ్రీనివాసులు

– ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్​, చిట్వేలి : కోవిడ్​ బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. త్వరగా కోలుకునేలా చూడాలని ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు వైద్యులకు సూచించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేశారు. హాస్పిటల్ వచ్చిన బాధితులను మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో 20 ఆక్సిజన్​ బెడ్లు, 20 కాన్సంట్రేటర్​ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ కోవిడ్​ నిబంధనలు పాటించాలని, కరోనా వైరస్​ సమష్టి కృషితో తరిమికొడదామని పిలుపునిచ్చారు. ఆయన వెంట నాయకులు వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, సుకుమార్ రెడ్డి, రమేష్, మండలం అధికారులు, మండలం నాయకులు తదితరులు ఉన్నారు.

About Author