PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొట్టిశ్రీరాములు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

1 min read

– పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయం జమీల్‌ అహ్మద్‌ బేగ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆంధ్రరాష్ట్ర అవతరణకోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు 122వ జయంతిని గురువారం కృష్ణా జిల్లా పెనమలూరు సెంటర్‌లో ఎంవీఆర్‌ కోట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయమని, భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు కారణభూతుడు, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్దరణ అనే ఆశయాల కోసం జీవితాంతం క షి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, ఆయన సేవలను స్మరించుకొని భావితరాల వారికి కూడా పొట్టి శ్రీరాములు త్యాగఫలాన్ని తెలియజేయాలని కోరారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఆ మహనీయుని త్యాగాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, రాజ్‌కుమార్‌, శేషయ్య, నారాయణలు పాల్గొన్నారు.

About Author