PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో టిడిపి శ్రేణులు సంబరాలు

1 min read

– పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపు
– అధికార పార్టీకి కౌంట్ డౌన్ మొదలు : రమేష్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలో గత మూడు రోజులుగా నువ్వా నేనా అన్నట్లుగా చాలా ఉత్కంఠ మధ్య ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది.వైకాపా అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డి,టిడిపి అభ్యర్థిగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు.ఈనెల 13వ తేదీన జరిగిన ఎన్నికలు జరిగాయి.రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో పశ్చిమ రాయలసీమ టిడిపి అభ్యర్థి ఎమ్మెల్సీగా పోటీచేసిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి 8 వేల మెజారిటీతో చాలా ఉత్కంఠత మధ్య గెలుపొందారు.ఎమ్మెల్సీగా గెలిచినందుకుగాను మిడుతూరు టిడిపి కార్యాలయం దగ్గర టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చుతూ కేకును కట్ చేశారు.అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవికి 27 వేల మెజార్టీ వచ్చింది.తూర్పు రాయలసీమలో కంచర్ల శ్రీకాంత్ కు 20వేల మెజార్టీకి పైగా మెజార్టీ వచ్చిందని అన్నారు.అధికార పార్టీ పట్టభద్రులకు డబ్బు వెదజల్లినా కూడా టిడిపి అభ్యర్థులకే ఓటర్లు పట్టం కట్టారని రమేష్ రెడ్డి అన్నారు.ఈ ఎన్నికలతోనే అధికార పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేసి వచ్చే సంవత్సరంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు మేమంతా కృషి చేస్తామని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో సుధాకర్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,సుధాకర్,శేషిరెడ్డి, తిమ్మారెడ్డి,నాగేంద్రుడు,ఇద్రీస్, సర్వోత్తమ్ రెడ్డి,వలి, గోకారి అయ్యన్న వెంకటేశ్వర్లు,చాంద్ బాష, లక్ష్మీనారాయణ రవి తదితరులు పాల్గొన్నారు.

About Author