PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండె పోటుతో మృతి చెందిన పేరా రాధా కృష్ణా రెడ్డి

1 min read

– ఆయన మృతికి నివాళులు అర్పించి నాగార్జున రెడ్డి కి పరామర్శించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో.కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామానికి చెందిన వైయస్సార్ పార్టీ జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు పేరా నాగార్జున రెడ్డి తండ్రి పేరా రాధా కృష్ణా రెడ్డి (వయస్సు 72 సంవత్సరాలు )నిన్న రాత్రి గుండె పోటు తో మృతి చెందారు.విషయాన్ని తెలుసుకొన్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన మృత దేహానికి నివాళులు అర్పించి నాగార్జునరెడ్డి నీ పరామర్శించారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ నాగార్జున రెడ్డి కి పితృ వియోగం చెందడం చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పారు. నాగార్జున రెడ్డి కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా వుంటాను అని చెప్పారు.ఈ కార్యక్రమం లో పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దం రెడ్డి రాం మోహన్ రెడ్డి, పేరా రుషికేశ్వర్ రెడ్డి, పేరా వివేకానంద రెడ్డి, కర్నాటి వేణుగోపాల్ రెడ్డి, కర్నాటి రామకృష్ణారెడ్డి, పేరా మల్లికార్జున్ రెడ్డి, పేరా జయ వర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author