PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రంధాలయాలు పన్నులను జమ చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో 2018 నుండి 2023 వరకు వసూలు చేసిన ఇంటి పన్ను నుండి ఎనిమిది శాతం గ్రంథాలయ పన్నును జిల్లా గ్రంధాలయ సంస్థకు నిధులకు జమ చేయాలని పత్తికొండ శాఖ గ్రంథాలయ అధికారి ఎస్ రామ్ కుమార్ పంచాయితీ విస్తరణ అధికారి మరియు డివిజనల్ పంచాయతీ అధికారి పత్తికొండ శ్రీకాంత్ కు వినతి పత్రము అందజేశారు. గ్రంధాలయాలు అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలు వసూలు చేసే ఇంటి పన్నుతో పాటు గ్రంధాలయ పన్ను నిధులను సకాలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కు జమ చేయాలని ఆయన అందులో కోరారు.అలాగే పంచాయతీ అధికారులు గ్రంథాలయాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, పంచాయతీ డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీకాంత్ గారికి విజ్ఞప్తి చేశారు.

About Author