PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

– పార్టీ కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి
– మంత్రాలయం నియోజకవర్గం సీనియర్ నాయకులు ఉలిగయ్య
– తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల కేంద్రమైన కార్యక్రమం నిర్వహించగా,సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మే ప్రతి పేదవాడికి కూడు, గూడు ,గుడ్డ, అనే నినాదంతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు స్త్రీ సమానత్వం మహిళ ఢిల్లీలో బందీ అయిన తెలుగు వాడి ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసానికి ప్రతికగా నిలిచిన తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29 స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 41 సంవత్సరాలు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కొత్తగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జెండా ఎగురవేసి నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు సురేష్ నాయుడు, ఉలిగయ్య, మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలో మేము ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని ఆనాటి నుండి ఈనాటి వరకు సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీని కొనియాడారు. ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీకి కృషిచేయాలని రాబోయే ఎన్నికల్లో 2024 భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆవిర్భావ వేడుకలు సందర్భంగా పురవీధుల్లో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ అమర్ రహే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం సీనియర్ నాయకులు ఉలిగయ్య , లక్కె గోవిందు, నీలకంఠ రెడ్డి, సతీష్ నాయుడు, కుంబులురు చిన్న, ముకాయ్య, శ్రీరామ్, అమ్ము వలి లింగేష్, బోజరజ్, వెంకటేశ్వర్లు, మరియు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వచ్చి వేడుకలను ఘనవిజయం చేశారు.

About Author