NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏబీఏం చర్చ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : రన్ ఫర్ జీసస్ కార్యక్రమం శనివారం స్థానిక ఏబీఏం చర్చి నుండి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ సెంటర్ జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు దైవజనులు. క్రైస్తవ సంఘ పెద్దలు మరియు యువతి యువకులతో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు,. ఏసుక్రీస్తు సిలువ శ్రమ. మరణ పునరుద్దానాన్ని స్మరించుకుంటూ ఈస్టర్ పండుగ పర్వదిన సందర్భంగా. క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచి మరణాన్ని జయించారని తిరిగి మహిమతో త్వరలో రానై ఉన్నాడని విశ్వసిస్తూ సువార్తను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పీ ప్రసంగీ. సామెలు బాలస్వామి వెంకటేష్ కిరణ్ పెద్దన్న శ్రీధర్ సురేంద్ర , మరియు అన్ని క్రైస్తవ సంఘాల నాయకులు యవనస్తులు, స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

About Author