PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ్యోతిరావు పూలే 197వ జయంతి నీ పురస్కరించుకొని ఘన నివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు వెలుగోడు పట్టణంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ శిల్పా భువనేశ్వర రెడ్డి వెలుగోడు లోని వేంపెంట రోడ్డు సర్కిల్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే 197వ జయంతి నీ పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం అతను అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశాడు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు , కులాల ప్రజలకు కూడా చేరవేర్చారు, మహిళల అభ్యున్నతి కోసం, కుల వ్యవస్థ అంతం కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త “మహాత్మా జ్యోతిరావు పూలే” గారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి మండలం నాయకులు, బీసీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About Author