PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘టైక్వాండో’ విజేతలకు అభినందన

1 min read

పల్లెవెలుగు:టైక్వాండో పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్​. బుధవారం నగరంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో టైక్వాండో విజేతలు టీజీ భరత్​ను కలిశారు . ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్​, సర్టిఫికెట్స్​ అందజేశారు. అనంతరం టీజీ భరత్​ మాట్లాడుతూ  జిల్లాస్థాయిలో ఆడి రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడం చాలా సంతోషకరమన్నారు.  S. శివశంకర్. N.S. మల్లేష్ విజయనగరంలో,  తిరుపతిలో మధుసూదన్ పోటీలకు సహకారాలు అందిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో జి అబ్దుల్ ఆమిద్ టిడిపి మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ మరియు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వచ్చేనెల తిరుపతిలో 1.2.3 విజయనగరంలో  15. 16 రోజులు పాల్గొన్న విద్యార్థులకు రోజు సాధనం చేయడం వలన ఆత్మ రక్షణతో పాటు అన్ని రంగంలో రాణిస్తారని తల్లిదండ్రులు చిన్నతనం నుంచి ఇలాంటి క్రీడలు సాధన చేయించాలని విద్యార్థులు బంగారు పతకం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో A. రోహిత్. మధుసూదన్ శివ శంకర్ N.S. మల్లేష్. సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

About Author