PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైకు ర్యాలీకి భారీగా తరలి వెళ్లిన నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక పర్యాటక మరియు యువజనా భివృద్ధి శాఖ మంత్రి శనివారం ఆర్కే రోజా నందికొట్కూరు నియోజకవర్గంలో నందికొట్కూరు పట్టణం మరియు పగిడ్యాలలో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియాలను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వస్తున్న సందర్భంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బి.గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామం నుంచి 30 బైకులకు వైసీపీ జెండాలను కట్టుకొని గ్రామం నుండి నందికొట్కూరు మరియు మచ్చుమర్రి గ్రామం వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వైసీపీ నాయకులు బైక్ ర్యాలీకి భారీగా తరలి వెళ్లారు.ఈకార్యక్రమంలో బి.జయ ప్రతాపరెడ్డి,ఎం.రాంభూపాల్ రెడ్డి చిన్న దస్తగిరి,ఉషన్న, నాగస్వాములు,బోయ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author