PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి నాయుడును సత్కరించిన వాల్మీకులు   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నూతనంగా కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులుగా ఎన్నికైన బిటి నాయుడు పత్తికొండ వాల్మీకులు బుధవారం ఘనంగా సత్కరించారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రివర్యులుశ్రీ. నారా చంద్రబాబునాయుడు గారు బీ.సి లకు గుర్తింపునిస్తూ, వాల్మీకి సామాజిక వర్గమునకు చెందిన శ్రీ బి.టి.నాయుడు గారిని  రెండు మార్లు ఎంపీ అభ్యర్థిగా,MLC గా, ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులుగా నియమించిన సంధర్బంగా  పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజా నందు వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో అభినందన, సన్మాన కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ పోలిట్ భ్యూరో సభ్యులు,  మాజీ ఉప ముఖ్యమంత్రి వర్వులు పెద్దలు   శ్రీ కె.ఇ.క్రిష్ణమూర్తి గారు , పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జి శ్రీ కె.ఇ.శ్యామ్ బాబు గారు హాజరై నూతన టిడిపి జిల్లా అధ్యక్షుడు డి టి నాయుడును అభినందిస్తూ, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకట రాముడు, మనోహర్ చౌదరి, రామానాయుడు, బత్తిని లోకనాథ్, బనగాని శ్రీనివాసులు, సింగం శ్రీనివాసులు, మీరా సాహెబ్, వీటి గోవిందు, పెద్దవంతి మాజీ సర్పంచ్ తిప్పన్న, నియోజకవర్గ టిడిపిముఖ్యులు, వాల్మీకి సోదరులు,పలువురు హాజరయ్యారు.

About Author