PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవం.. ఆంజనేయుడి పల్లకోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆదోని : పట్టణంలోని క్రాంతినగర్​లో వెలిసిన శ్రీమత్​ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణంలో శుక్రవారం హనుమాన్​ జయంతిని భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయమే ఆలయ పూజారి రామదాస్​ స్వామివారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. సాయంత్రం శ్రీమత్​ ఆంజనేయ స్వామి చారిటబుల్​ ట్రస్ట్​ అధ్యక్షుడు బుదార్పు లక్ష్మన్న, ఉపాధ్యక్షులు పాలుట్ల వెంకటేశ్వర శెట్టి ఆధ్వర్యంలో స్వామివారిని పురవీధుల గుండా పల్లకిలో ఊరేగించారు. అంతకు ముందు హనుమాన్​ చాలీసా పారాయణం ఘటించారు. ఈ సందర్భంగా బుదార్పు లక్ష్మన్న మాట్లాడుతూ కోవిడ్​ నిబంధనలను అనుసరించి హనుమాన్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు.

ఆలయ కమిటీ సభ్యుల సహకారం.. ప్రజల తోడ్పాటుతో శ్రీమత్​ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చారిటబుల్​ ట్రస్ట్​ అధ్యక్షుడు బుదార్పు లక్ష్మన్న ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కమిటీ కోశాధికారి జక్కా వీరేష్​, సభ్యులు పుట్టా రామాంజనేయులు, రామకృష్ణ, జె.రామాంజనేయులు, మల్లికార్జున, క్యామ శ్రీనివాసులు, ఎం. ఉరుకుందు, శేషాద్రి, దేవరాజ్​, యువరాజ్​, హర్ష తదితరులు పాల్గొన్నారు.

About Author