PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ               

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పోచిమిరెడ్డి సేవాదళ్ సౌజన్యంతో బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ప్రతినెల 9వ తేదీ స్కానింగ్ కొరకు పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీ స్త్రీలు మరియు వారి సహాయకులకు  పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి సహకారంతో పౌష్టికాహారం పంపిణీ నిరంతరం కొనసాగుతుoదని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ కల్పన స్వయంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార భోజనం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల మాదిరిగానే ఈసారి దాదాపు 300 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేశామని తెలిపారు.   ఈ కార్యక్రమంలో MPTC లు అనిత, సరోజ వార్డ్ మెంబర్ లైట్ నాగరాజు, మాజీ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కె. కోటేశ్వరరావు, శివ మరియు పోచిమిరెడ్డి సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

About Author