PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపితోనే మహిళలకు సంక్షేమం.. అభివృద్ధి : టి.జి భరత్

1 min read

– మహాశక్తి చైతన్య రథం జెండా ఊపి ప్రారంభించిన టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మహిళలకు సంక్షేమం, అభివృద్ధి ఉంటాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని మౌర్య ఇన్ లోని ఆయన కార్యాలయం ఎదుట మహాశక్తి చైతన్య రథాన్ని ఆయన మహిళలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వస్తే మహిళలకు అన్నివిధాలా మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబునాయుడు మొదటి విడత మేనిఫెస్టోలో మహిళల కోసం తీసుకొచ్చిన పథకాలను వివరించారు. మహాశక్తి చైతన్య రథం ద్వారా ప్రజల్లోకి ఈ పథకాలను బలంగా తీసుకువెళ్లాలని మహిళలకు సూచించారు. ఈ పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూత అందుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రజలందరి భవిష్యత్తు మారుతుందన్నారు. మహిళలు వాడవాడలా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీనివాసమూర్తి, మహిళా నేతలు ముంతాజ్, సంజీవ లక్ష్మి, మారుతీ శర్మ, రాజ్యలక్ష్మి, శాంతమ్మ, విజయలక్ష్మి, సౌభాగ్యమ్మ, మున్ని, పద్మావతమ్మ, హయత్, తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author