PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం..

1 min read

– ముఖ్యమంత్రి జగనన్న పాలనలోనే సంక్షేమం 

– ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి                   

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో శనివారం ఎమ్మెల్యే  అబ్బయ్య చౌదరి  గడపగడపకు పర్యటించారు. ఎమ్మెల్యే తో గ్రామ ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు మరింత ఉత్సాహంతో అడుగులు ముందుకు వేశారు.గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు దంపతుల  ఆధ్వర్యంలో ఘన స్వాగతం భారీ గజమాలతో అబ్బాయి చౌదరికి ఘన స్వాగతం పలికారు. వైయస్సార్ సిపి నాయకులు , కార్యకర్తలు, మహిళలు, ప్రజలుగజమాలలు, పూలతో మహిళల మంగళ హారతులు అందించారు.  ఉత్సాహంగా సాగుతున్న గడప గడపకు కార్యక్రమం  స్వాగత ద్వారం వద్ద నుండి  ప్రారంభమై కార్యక్రమం తీన్మార్లతో కోలాటాలతో సాంస్కృత కార్యక్రమాలతో అట్టాహాసంగ, ఆర్భాటంగా  వేలాదిమంది అభిమానులు  ఉత్సాహాన్ని నింపారు,ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి  అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తూ గడప గడపకు పాదయాత్రగా పర్యటించిన ఎమ్మెల్యే  పథకాల తీరును ప్రజలకు వివరంగా తెలియజేశారు. సంక్షేమ పాలనతో తమకు జగనన్న ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తుందంటూ హర్షం వ్యక్తం చేసి లబ్ధిదారులు అబ్బయ్య చౌదరికి  మహిళలు పూల వర్షం కురిపించారు.  మండలంలో గ్రామంలో జరిగిన సంక్షేమ పథకాలు అందిస్తున్న అధికారులకు జడ్పీ సీఈవో రవికుమార్ , డిపిఓ తూతక శ్రీనివాస్, డిఆర్డిఏ పిడి విజయ రాజుకు పూలమాలలు వేసి శాలువా కప్పి ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు దంపతులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో వైసిపి ధనుంజయ్ సత్కరించారు. కార్యక్రమంలో దెందులూరు ఏం సి చైర్మన్ అప్పన ప్రసాద్, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి,  మరియు ఇన్చార్జి అధికారులు. మండల అధికారులు. ఎంపీపీ, సర్పంచులు, వైసీపీ శ్రేణులు సచివాలయ సిబ్బంది. కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

About Author