PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

31న మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ రహాత్ ప్రమాణ స్వీకారం

1 min read

– భారీ ఎత్తున హాజరు కానున్న వైసీపీ నేతలు.

– కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఈ నెల 31న  నందికొట్కూరు మార్కెట్ యార్ఢ్‌ చైర్మన్‌ షేక్ రహత్  ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా హాజరుకావాలని  నంద్యాల జిల్లా ఎంపీ  పోచా బ్రాహ్మనందరెడ్డి , ఎమ్మెల్సీ  ఇసాక్‌ భాషా లను వైసీపీ నాయకులు  షేక్‌జబ్బార్‌ ,మార్కెట్ యార్ఢ్‌ వైస్‌ చైర్మన్ మొల్ల షరీప్‌ ,మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి ,మార్కెట్ యార్ఢ్‌ డైరెక్టర్‌ జలీల్‌ అహ్మాద్‌ ,వైసీపీ సీనియర్ నాయకులు ఉస్మాన్‌ బేగ్‌  ఆహ్వానించారు.  వారివారి కార్యాలయాలలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కృషి పట్టుదలతో  50 ఏళ్ల నందికొట్కూరు మార్కెట్ యార్డు చరిత్రలో ఒక మహిళకు చైర్మన్ పదవి కేటాయించిన చరిత్ర సీఎం జగన్ మోహన్ రెడ్డిదే అని పేర్కొన్నారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆశీస్సులతో  31 న జరుగుతున్న ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరై మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులకు ఆశీర్వాదాలు అందజేయాలని కోరారు.

About Author