PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా. రఘువీరారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎం. అమానుల్లా

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  గౌరవ నీయులైన. మాజీ మంత్రివర్యులు సి డబ్ల్యూ సి . అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యులైన డాక్టర్ రఘువీరారెడ్డిని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. హొళగుంద మండలం జిల్లా సహాయ కార్యదర్శి ఎం. అమానుల్లా మర్యాదపూర్వకంగా కలవడం అయినది. అమానులతో రఘువీరారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అంటే బి అంటే బాబు జి అంటే జగన్ పి అంటే పవను. అని తెలియజేయడమైనది కనుక రాష్ట్ర ప్రజలారా మన దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టి బిజెపి ప్రభుత్వం రాబోయే 2024లో ఆ పార్టీకి ఓటు వేయకుండా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని రఘువీరారెడ్డి అమానులతో చెప్పడం జరిగింది. రఘువీరారెడ్డి సార్ తో అమానుల్లా మాట్లాడుతూ కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అందరినీ కలుపుకొని ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కాబోయే ప్రధాని మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్ కి మొదటి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తారని తెలియజేయడమైనది అదేవిధంగా నిరుపేదలకు ఒక ఇంటికి 6000 సహాయము. వృద్ధులకు. వితంతువులకు నెలకు పింఛను 4000 చేస్తారని ఇదే కాకుండా. ఇంకొకటి ముఖ్య విషయం ఏమనగా దేశానికి వెన్నుపోటు లాంటి రైతులకు రైతు రుణాలు మాఫీ ఆరు లక్షల వరకు చేస్తానని తెలియజేయడమైనది. కావున ఎస్టీ, ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులారా రాబోయే 2024లో టిడిపి జగన్ పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆలూరు నియోజకవర్గ హొళగుంద మండలం జిల్లా సహాయ కార్యదర్శి ప్రజలను కోరడమైనది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

About Author