PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపి రాష్ట్ర గవర్నర్​కి  ఘన స్వాగతం

1 min read

– జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి 352వ ఆరాధనోత్సవాలలో పాల్గొననున్న సందర్భంగా హైదరాబాదు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కర్నూలుకు రోడ్డు మార్గమున బయలుదేరి మధ్యాహ్నం 2:10ని.లకు కర్నూలు పోలీసు అతిథి గృహమునకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ కి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.రాష్ట్ర గవర్నర్ కు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి , జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య , డిఐజి సెంథిల్ కుమార్ , జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ , నగర మేయర్ బివై.రామయ్య , మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ , నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా  కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ , 41వ వార్డు కార్పొరేటర్ గాజుల శ్వేతా రెడ్డి  తదితరులు స్వాగతం పలికారు.అనంతరం మధ్యాహ్నం 3:40ని.లకు పోలీసు అతిథి గృహం నుండి మంత్రాలయం బయలుదేరి వెళ్లారు.రాష్ట్ర గవర్నర్ కు వీడ్కోలు పలికిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి , జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య , డిఐజి సెంథిల్ కుమార్ , జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ , నగర మేయర్ బివై.రామయ్య , మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ , నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా , కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ , 41వ వార్డు కార్పొరేటర్ గాజుల శ్వేతా రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

About Author