PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియ‌ర్ డాక్టర్ల స‌మ్మె..ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లో జూనియ‌ర్ డాక్టర్లు స‌మ్మెకు దిగారు. ప్రభుత్వం స్పందించ‌కుంటే భవిష్యత్ కార్యాచ‌ర‌ణ ప్రక‌టిస్తామ‌ని స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేషియా ప్రక‌టించాల‌ని, కోవిడ్ ఇంటెన్సివ్ ఇవ్వాల‌ని, ఆస్పత్రుల్లో భ‌ద్రత పెంచాల‌ని, టీడీఎస్ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. త‌మ స‌మ‌స్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామ‌ని, ప్రభుత్వం నుంచి స్పంద‌న‌లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. త‌మ డిమాండ్ల నెరవేర్చాల‌ని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు సర్వజన మెడికల్​ కళాశాలలో జూనియర్​ డాక్టర్లు డా. ప్రణీత్​, డా. కృష్ణప్రియ, డా. రామాంజనేయ రెడ్డి, డా. కిరణ్​ తదితరులు సమ్మెలో పాల్గొన్నారు.


About Author