PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటో డ్రైవర్లు… జాగ్రత్తగా నడపాలి

1 min read

– ఎస్ఐ విజయలక్ష్మి
పల్లెవెలుగు వెబ్​, ఆదోని రూరల్: డ్రైవింగ్​ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. ట్రాఫిక్​కు సహకరించాలని ఆటో డ్రైవర్లకు ఎస్​ఐ విజయలక్ష్మి కోరారు. గురువారం ఆదోని మండలం కపటి గ్రామంలో ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప ఆదేశాల మేరకు నిర్వహించిన సదస్సులో ఎస్​ఐ విజయలక్ష్మి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ ఆటోలను నిలుపరాదని, ప్రయాణికులను జాగ్రత్తగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఆటో డ్రైవర్లు సహకరించాలన్నారు. ట్రాఫిక్​రూల్స్​ పాటించని డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్​ఐ విజయలక్ష్మి హెచ్చరించారు.

About Author