PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరణంలో వీడని భార్య భర్తల బంధం

1 min read

-కుటుంబ కలహాలతో ఏర్పడిన మన స్పర్థలతో మానసిక ఆవేదన చెంది  

– తన భార్య ఆత్మహత్య పాల్పడ్డాన్ని తట్టుకోలేకపోయాడు- తన భార్య లేని జీవితం తన కెందుకని ఆమెతో పాటు మరణించాలని నిర్ణయం తీసుకొని తాను బంగారు అంగడిలో ఉపయోగించే సైనేడ్ ద్రావకం తాగి ఆత్మహత్యకు పాల్పడి తన భార్య వద్దనే మరణించాడు ఈ సంఘటన చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూక వారి పల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కుటుంబ కలహాలతో రూకవారిపల్లెకు చెందిన దంపతులు కొర్రపాటి రవిశంకర్ ఆచారి (52) ఆయన భార్య సరస్వతమ్మ, (45)కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, కడప నగరం చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుకవారిపల్లె కు చెందిన కొర్రపాటి రవిశంకర్ ఆచారి, సరస్వతమ్మల దంపతులకు నలుగురు సంతానం ఇందులో ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు కాగా పెద్దమ్మాయి ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో మన స్పర్థలు ఏర్పడ్డాయన్నారు. అయితే కొద్ది రోజులకు పెద్దమ్మాయి కుటుంబంతో కలిసిపోయినప్పటికీ కూడా మనస్పర్ధలు తొలగలేదన్నారు. అయితే అప్పటికే చిన్న కుమార్తె అయిన లిఖితేశ్వరి అమెరికా వెళ్లి చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోకపోవడంతో, తన అక్కతో ఈ విషయాన్ని చెప్పి ఆమె ప్రోత్సాహంతో తల్లిదండ్రులకు చెప్పకుండా లిఖితేశ్వరి లా” చదువుల కోసం అమెరికాకు వెళ్లడం జరిగింది అన్నారు. ఇక పెద్ద కుమారుడు విక్రమ్ ఆదిత్య ఆచారి గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తూ బచ్చుంపల్లెకు చెందిన ఒక అమ్మాయిని మూడు నాలుగు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు మరింత తీవ్ర మనోవేదనకు గురైనట్లు వారు తెలిపారు, ఈ క్రమంలో భర్త రవిశంకర్ ఆచారి, చిన్న కుమారుడు వినయ్ ఆనంద్ ఆచారి వృత్తి రీత్యా బంగారు అంగడికి వెళ్ళగా, సరస్వతమ్మ తన ఇంటిలో ఒక్కటే ఒంటరిగా కూర్చుని తీవ్రంగా ఆలోచించి శనివారం ఉదయం 10:30 గంటలకు ఇంట్లో ఉండే యాసిడ్ ద్రావకాన్ని దగ్గర్లో ఉన్న బాత్రూం సమీపంలోకి వెళ్లి తాగడం జరిగిందన్నారు, తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో పడుకొని యాసిడ్ మంటకు తాళ లేక మంట మంట అని అరవడంతో కింద ఇంటిలో ఉన్న వారు ఆమెను కడపలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి(సన్ రైజ్ హాస్పిటల్) కు ఆటోలో తీసుకుపోవడంతో ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు, భర్త ఆమె మరణం వార్త విని వికటజీవిగా పడివున్న భార్య మృత దేహాన్ని చూసి తాళలేక అతను పనిచేస్తున్న అంగడి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న సైనేడ్( విష ద్రావకం) తాగి మరణించినట్లు పోలీసులు తెలిపారు, ఎంతో అన్యూన్యంగా ఉన్న భార్యాభర్తలు దాంపత్యం దసరా పండుగ నాడు భార్య భర్తలు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, భార్యాభర్తల మృత దేహాలను చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యటమయ్యారు, కాగా పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

About Author