PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోపాష్టమి సందర్భంగా గో పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ శివారులోని విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు గోపాష్టమి సందర్భంగా స్థానిక రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈరోజు గో పూజలు, ఉసిరిక పూజలు నిర్వహించారు .పాఠశాల విద్యార్థులు విహారయాత్రలో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ, వనయాత్ర ,మొక్కలు ,చెట్ల పెంపకము వంటి అంశాల పైన అవగాహన కల్పిస్తూ ఈ యాత్ర కొనసాగింది .ముందుగా రూపాల సంగమేశ్వర స్వామి ని దర్శించి ఆ తర్వాత అవగాహన సదస్సు , సామూహిక భోజనము వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ చంద్రమోహన్ , శ్రీయస్ రామిరెడ్డి , శ్రీ ఆర్ నాగేశ్వర్ రెడ్డి ,శ్రీ ఎం సోమయ్య , శ్రీ మురళి  , శ్రీ శివారెడ్డి , శ్రీ వంశీ రాఘవ, శ్రీ హిమాయత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

About Author