PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ షిరిడి సాయి మందిర్ లో అయ్యప్ప దీక్షాపరులకు అన్నదానం..

1 min read

– ప్రతి గురువారం అన్నదాన ప్రసాద వితరణ చేయడం అభినందనీయం..

– టిడిపి ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : గురువారం  స్థానిక ఆదివారపు పేటలో వేంచేసి ఉన్న పురాతనమైన శ్రీ శిరిడి సాయి  మందిరం  వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు(ఐటిఆర్) ఆధ్వర్యంలో మరియు కమిటీ వారు గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప దీక్ష పరులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి గురువారం అన్నదానం నిర్వహిస్తుంటారు. శ్రావణ మాసం గురువారం నాడు ప్రత్యేక అన్నదానాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానం టిడిపి ఏలూరు  నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) విచ్చేశారు. ఈ మేరకు ప్రత్యేక పూజలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం  అయ్యప్ప స్వామి దీక్షదారులకు ఏర్పాటుచేసిన అన్నదాన ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author