PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల వ్యాప్తంగా ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చెన్నూరు మండల వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు, ముందుగా చెన్నూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జోహార్ వైయస్సార్ అంటూ నినాదాలు చేశారు, తదుపరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానులకు పచ్చిబెట్టారు, అలాగే చెన్నూరు సామాజిక ఆరోగ్య కార్యకర్త కేంద్రంలో రోగులకు పండ్లు పెంచిపెట్టారు, అదేవిధంగా చెన్నూరు పాత బస్టాండ్ లొ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెడబల్లె గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో జననేత జగనన్న పుట్టినరోజు సంధర్భంగా కేక్ కటింగ్ చేసి, వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు, ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, గణేష్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ, పేదల నిస్పక్షపాతి , నవరత్నాల సృష్టి కర్త, సి ఎస్ టి బి సి మైనార్టీల ఆశజ్యోతి YS జగన్ మోహన్ రెడ్డి కి వారు మండల వైఎస్ఆర్సిపి అభిమానులు ,కార్యకర్తలు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, కమలాపురం నియోజకవర్గ మైనార్టీ నాయకులు అన్వర్ భాష, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచ్ సిద్ధి గారి వెంకటసుబ్బయ్య, జె ఏ సి ఎస్ మండల కన్వీనర్ నిరంజన్ రెడ్డి, జె సి ఎస్ టౌన్ కన్వీనర్ శ్రీనివాసరాజు, వైఎస్ఆర్సిపి నాయకులు మండల యువ నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి , వైఎస్ఆర్సిపి మండల సీనియర్ నాయకులు, గోవిందు, పుల్లారెడ్డి,పాలగిరి ఉమామహేశ్వర్ రెడ్డి,మల్లి , BC నాయకులు నిత్య, ఎంపీటీసీ , సోషల్ మీడియా కన్వినర్ రమేష్, పండు, ఉదయ్ కుమార్ (కిట్టు ) రవి, వెంకట సుబయ్యా, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author