PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గౌరు  వెంట ఉంటాం.. గడివేముల మండల కన్వీనర్ సత్యం రెడ్డి..

1 min read

పల్లెవెలుగు వెబ్  గడివేముల:  గౌరు చరిత. గౌరు వెంకట్ రెడ్డి వెంటే ఉంటామని తెలుగుదేశం పార్టీ వదిలి ప్రసక్తే లేదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండల టిడిపి నాయకులు దేశం సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఎదుగుదలను చూసి ఓర్వలేక మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరిత రెడ్డి గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లే ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడని మండల టిడిపి నాయకులు దేశం సత్యనారాయణరెడ్డి తెలిపారు.

About Author