PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రైనేజీ పనుల పర్యవేక్షణ

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు :  చెన్నూరు రాజుల కాలనీ నుండి సరస్వతి నగర్ , లక్ష్మీ నగర్, యానాదికాలని, గాంధీనగర్, బెస్త కాలనీల మీదుగా జరుగుతున్న ప్రధాన డ్రైనేజీ కాలువ పనులను ఎస్ ఈ ఎంసీ వీరన్న, డి ఈ మురళి కొండారెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు పర్యవేక్షించారు, సుమారు 45 లక్షల రూపాయల ఎంపీ నిధులతో చేపట్టిన ఈ పనులను వారు పర్యవేక్షించడంతో పాటు వారు కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ, ఎక్కడ ఎక్కడ రాజీ పడకుండా పనులను నాణ్యతతో నిర్వహించారని తెలిపారు, అలాగే పనులు వేగవంతంగా నిర్వహించడం తో పాటు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఏ ఈ వినోద్ కుమార్ రెడ్డి, కాంట్రాక్టర్ నీలం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author