కొల్లేటి కోట శ్రీ పెద్దింట్లమ్మ తల్లి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
1 min read
మార్చి1వ తేదీ నుండి 13వ తేదీ వరకు కార్యక్రమాలు
పటిష్టమైనటువంటి సీసీ కెమెరాలు,డ్రోన్,పోలీస్ బందోబస్తు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కైకలూరు కొల్లేటి కోట శ్రీ పెద్దింట్లమ్మ తల్లి వారి వార్షిక ఉత్సవాలు మార్చి 1వ తేదీ నుండి నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)తెలియ చేసినారు.ఈ సందర్భంగా భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఏలూరు డిఎస్పి, డి శ్రావణ్ కుమార్ యొక్క ఆదేశాలపై కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ గారు, రూరల్ ఎస్ ఐ రాంబాబు, దేవాలయ అధికారులతో మరియు ఆలయం పరిసర ప్రాంతాలలో వ్యాపార సముదాయాల యజమానులతో సమావేశం నిర్వహించారు.భక్తులు అనుకూలంగా దర్శన భాగ్యం చేసుకునేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.సీసీ కెమెరాల ఏర్పాట్లు: దేవాలయం ప్రాంగణం చుట్టూ సీసీ కెమెరాలను అమర్చారు. డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ చేస్తున్నట్లుఆలయ ప్రాంగణంలో పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతను అందుబాటులో ఉంచారు.ఉత్సవ సమయంలో భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. 10.03.2025: జల దుర్గ గో కర్ణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం – ఈ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నందున, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.13.03.2025: తెప్పోత్సవం – భక్తుల రద్దీ మరియు సముదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు కైకలూరు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.భక్తులు ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆలయ పాలనాకర్తల సూచనలను పాటించాలని కోరడమైనది. కైకలూరు రూరల్ పోలీసులు, దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్ ఒక ప్రకటనలో తెలియ చేసినారు.
