NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రైస్తవుల 40 రోజులు ఉపవాస సిలువ ధ్యాన ప్రార్థనలు ప్రారంభం

1 min read

సెయింట్ మైకేల్ చర్చ్ లో ప్రారంభించిన రెవరెండ్

ఫా:దిరిశిన ఆరోను

గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో దీక్ష దారులకు అల్పాహారం ఏర్పాటు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద సెయింట్ మైఖేల్ ఆర్ సి యం చర్చ్ ప్రాంగణంలో క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే విభూది బుధవారం 40 రోజులు మాల ధారణతో ఉపవాస సిలువ ధ్యాన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. వారికి ఉదయం 7 గంటలకు దివ్యబలి పూజ అనంతరం  రెవరెండ్ ఫాదర్:దిరిశిన ఆరోను జపమాలలు వేసి ఆశీర్వదించారు.అనంతరం సాయంత్రం సిలువ మార్గం ప్రార్థనలు చేసి మాల ధారణ దీక్షాపరులకి సుమారు   300 మందికి గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ సభ్యులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు సొంగ మధు, జాయింట్ సెక్రెటరీ,యర్రా  జయదాస్, ట్రెజరర్ పావని జ్యోతి, బాలరాజు, ఎబి ఆనంద్ మరియు సంఘ పెద్దలు,సంఘ కాపరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *