NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరమ పవిత్రం…శుభ శుక్రవారం

1 min read

వడ్డెమాను సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు

నందికొట్కూరు , న్యూస్​ నేడు:  పాపులను ద్వేషించకు.. పాపాలను ద్వేషించు..అన్న ప్రేమ మూర్తి..దైవ కుమారుడు ఏసుక్రీస్తుకు కల్వరి గిరిపై సిలువ వేసిన దినమే శుభ శుక్రవారం అని  కర్నూల్ సీఎస్ఐ చర్చి సిస్టర్లు రాజకుమారి,సౌభాగమ్మ  ప్రసంగించారు.శుక్రవారం మండల పరిధిలోని వడ్డెమాను గ్రామంలోని సీఎస్ఐ చర్చిలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిలువలో పలికిన ఏడు మాటలు (1).తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. (2).నేడు నీవు నాతో కూడా పరదైసులో నందువు, (3).అమ్మా! ఇదిగో నీ కుమారుడు..ఇదిగో నీ తల్లీ, నా దేవా(4) నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి(5). నేను దప్పికొనుచున్నాను(6). సమాప్తమైనది(7).తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను.అని క్రైస్తవ సోదరులకు బైబిల్ ప్రసంగం చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐ చర్చి సంఘ పెద్దలు యాట ప్రభాకర్,సగినేల జయపాల్, రాజ  స్వాములు,సంఘ కాపరి యాకోబు,సుబ్బన్న,తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.

About Author