NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎం గోడౌన్ తనిఖీ

1 min read

తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

భద్రత సిళ్లు,సీసీ కెమెరాలు, అగ్రిమాత్మక పరికరాల పనితీరు పర్యవేక్షణ

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్ల గోడౌన్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తనిఖీ చేశారు.  శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవిఎం యంత్రాలు, వివిప్యాట్ లు భధ్రపరిచిన గోడౌన్ ను  తనిఖీ చేశారు.  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖిలో భాగంగా ఈవిఎం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు,  మొదలైనవి పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్ ను పరిశీలించి అందులో సంతకం చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.  జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు,  కలెక్టరేట్ ఎన్నికల విభాగం  సిబ్బంది ఉన్నారు.

About Author