PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు  మౌలిక సదుపాయాలు ప్రభుత్వ లక్ష్యం

1 min read

కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ల్యాబ్ లు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని కమలాపురం శాసనసభ్యులు. పుత్త కృష్ణ చైతన్య రెడ్డి హామీ ఇచ్చారు. మండల కేంద్రమైన చెన్నూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల. బాలికల జూనియర్ కళాశాలను బుధవారం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి సందర్శించారు. జూనియర్ కళాశాల బాలికల ఉన్నత పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు ఉపాధ్యాయుల పనితీరుపై ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నాదేవి ని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు స్టూడెంట్ కిడ్స్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువులో రాణించాలని విద్యార్థులను కోరారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల ఆవరణంలో చిన్న వయసులో తోటి పిల్లలతో ఆటలు ఆడుకుండే వారిని తాత అవ్వ సొంత గ్రామం చెన్నూరు అని విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషియాలన్నారు.విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చక్కగా అందివ్వాలని కోరారు. ప్రతి పాఠశాలకు మౌలిక సదుపాయాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి. గంగిరెడ్డి. టు విద్యాశాఖ అధికారి సునీత. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నదేవి. ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ. తాసిల్దార్ ప్రకాష్ బాబు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్టి పాటీ రాణా ప్రతాప్ రెడ్డి. ఉపాధ్యాయులు. విద్యార్థులు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author